19 April, 2026 | 2:13 PM

ఆలె నరేంద్రకు నివాళి

10-04-2025 02:39 AM

హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో బుధవారం మాజీ ఎంపీ ఆలె నరేంద్ర 11వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నరేంద్ర చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పుష్పాంజలి ఘటించి,ఆయన సేవలను స్మరించుకున్నారు. పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్‌రావు, మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ర్ట మాజీ అధ్యక్షులు ఆలె భాస్కర్ ఇతర నాయకులు పాల్గొన్నారు.