నేడు టీఎస్ ఈసెట్ పరీక్ష

06-05-2024 01:02:27 AM

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): టీఎస్ ఈసెట్ ప్రవేశ పరీక్ష సోమవారం జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణకు రెండు తెలుగు రాష్ట్రా ల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 7.30 గంటల నుంచే అభ్యర్థులను అనుమతిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 99 కేంద్రాలను ఏర్పాటు చేయగా జిల్లాల్లో 48, హైదరాబాద్ రీజియన్‌లో 44 కేంద్రాలను ఏర్పా టు చేశారు. ఈ పరీక్షకు మొత్తం 24,272 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు కాలేజీ ఐడీ కార్డు లేదా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌లో ఏదోకటి తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్‌ఫోన్, క్యాలికులేటర్స్, స్మార్ట్ వాచ్ వంటివి లోనికి అనుమతించరని తెలిపారు.