02-06-2025 07:08:04 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్ గ్రామంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Alleti Maheshwar Reddy) టీఎస్ సీడ్ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి జీలుగు, సహా తదితర విత్తనాలను రైతులకు అందజేశారు. రైతులు మేలు రకమైన విత్తనాలను నాటి లబ్ధి పొందాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులను అన్ని విధాల ఈ ప్రభుత్వం మోసగిస్తుందని, వడ్ల కొనుగోలులో గత ప్రభుత్వం మాదిరి ఈ ప్రభుత్వం కూడా దోపిడీకి పాల్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు రావుల రాంనాథ్, మెడిసెమ్మ రాజు, జమాల్, సరికెల గంగన్న, మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నాయకులు అనిల్, సత్యం చంద్రకాంత్, మౌలానా, సాయిరెడ్డి, హుస్సేన్, రమేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.