27-05-2025 10:39:18 AM
హైదరాబాద్: సైబర్ నేరగాళ్ల(Cyber criminals)కు బ్యాంకు ఖాతాలు(Bank Accounts) సమకూరుస్తున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు మంగళవారం అరెస్ట్(Arrested) చేశారు. అధిక లాభాల పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తూ అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టింస్తున్నారు. బాధితుల నుంచి కాజేసిన సొమ్మును పలు బ్యాంకు ఖాతాలకు మళ్లిస్తున్నారు. కాగా, సైబర్ నేరగాళ్లకు ఆ బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఢిల్లికి చెందిన విజయ్ మిశ్రా, నొయిడాకు చెందిన రితీశ్ సింగ్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద భారీగా ఆధార్, పాన్ కార్డులు, డెబిట్ కార్డులు, సిమ్ లు లభించినట్లు తెలిపారు. నిందితులను ఢిల్లీలో అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకువచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.