15-06-2025 07:31:19 PM
రేచిన్, బెల్లంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఘటన..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) రేచిన్-బెల్లంపల్లి రైల్వేస్టేషన్ మధ్య ఆదివారం ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. జీ ఆర్ పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 06:40 గంటలకు ఇద్దరు వ్యక్తులు గుర్తు తెలియని డౌన్ రైలు బండిలో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు రైలు నుండి KM No. 235/4-8, డౌన్ లైన్ ట్రాక్ పక్కన (Up down line ట్రాక్ మధ్యలో), రేచిన్ రోడ్ - బెల్లంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య పడిపోయి తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయారు.
మృతుల్లో ఒకరీ వయసు 40-45 సంవత్సరాలు, బక్కపలుచని దేహం, తెల్లని లాల్చీ పైజామా ధరించాడు. పచ్చ బొట్టు/Tattoos “MAM DAD, ATEEC HAI, IRFAN, REHAN” కుడి చేతి పైన, ARFAN with love symbol, ANJUMAN ఎడమ చేతి పైన, MAA అనే పచ్చ బొట్టు మెడపై ఎడమ వైపు కలదు. రైలు ప్రయాణం టికెట్- Nagpur నుండీ కాచిగూడ వరకు టిక్కెట్ తీసుకున్నాడు. టికెట్ 14-06-2025, 22:09 తీసుకున్నాడు.
మరొకరీ వయసు 25-30 సంవత్సరాలు కాగా బక్కపలుచని దేహం, బెల్లంరంగు ఫుల్ హ్యాండ్స్ వింటర్ స్వెట్టర్, మెరూన్ రంగు ఫుల్ హ్యాండ్స్ షర్ట్, గోధుమ రంగు జీన్స్ ప్యాంట్ ధరించాడు. ఎడమ చేతి పైన MAM, DAD అని పచ్చ బొట్టు కలదు. చనిపోయిన ఇద్దరు వ్యక్తులు బహుశా ముస్లింలు పోలీసు భావిస్తున్నారు. వివరాలు తెలిసినవారు ఈ ఫోన్ నంబర్లకు 8712658596, 9490871784, 9949304574 కోరారు. ఈ మేరకు మంచిర్యాల రైల్వే ఎస్సై మహేందర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.