19-10-2025 12:13:57 PM
చిట్యాల,(విజయక్రాంతి): జాతీయ రహదారి 65 సమీపంలో నూతనంగా నిర్మించిన బంకిట్ కాఫీ కేఫ్ లో ఆదివారం ఉదయం వాటర్ ట్యాంక్ కూలి ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినారు. స్థానికుల వివరాల ప్రకారం నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన పెద్ద చెరువు వద్ద కాఫీ కేఫ్ నిర్మాణంలో పైకప్పుగా రేకులు వేసి ఆ రేకులపై వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేశారు. వాటర్ ట్యాంక్ లో పూర్తిగా నీళ్లు నింపడం వల్ల రేకులు ట్యాంక్ బరువును ఆపలేక ఇంటి పై కప్పు కుప్పకూలి పోయింది. ఆదివారం కేఫ్ ప్రారంభం కానుండడంతో దాని యజమాని శివ, ఆయన కుటుంబ సభ్యులు అందులోనే నిద్రిస్తుండగా ట్యాంక్ వారి పై పడి భార్య నాగ మణి(32) కుమారుడు(6) అక్కడికక్కడే మృతిచెందగా యజమాని తల్లి, కూతుర్లకు తీవ్ర గాయాలు కావడంతో నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు .