calender_icon.png 7 September, 2025 | 10:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడిపల్లిలో ఇద్దరి అదృశ్యం

05-09-2025 01:52:54 AM

మేడిపల్లి సెప్టెంబర్ 4 : పక్షవా తంతో బాధపడుతున్న వ్యక్తి ఇంటి నుండి వెళ్లి అదృశ్యమైన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ మున్సి పల్  హేమ నగర్‌కి చెందిన బండ్ల ప్రవీణ్ తన తల్లిదండ్రులతో  నివాసం ఉంటున్నాడు.

తన తండ్రైన బిక్షపతి(51) కొన్ని నెలల నుండి పక్షవాతంతో బాధపడుతూ సరిగ్గా నడవలేడు, మాట్లాడలేడు. బుధవారం ఉదయం 11 గంటలకు ఇంటి నుండి బయటకి వెళ్లిన తన తండ్రి మళ్లీ తిరిగి రాలే దు. చుట్టుపక్కల ఎంత వెతికినా సమాచారం లభించకపోవడంతో మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.

కేసు నమో దు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇట్టి వ్యక్తి గురించి సమా చారం లభిస్తే మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వగలరని సిఐ గోవిందరెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా వాకింగ్ కోసం బయటికి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. బోడుప్పల్ మున్సిపల్ పరిధి ఆర్‌ఎంఎస్ కాలనీకి చెందిన కృష్ణయ్య తన తల్లి దండ్రులతో కొంతకాలం నుండి నివా సం ఉంటున్నాడు.

తన తండ్రి జంగయ్య (70) బుధవారం ఉదయం వాకింగ్ కోసం బయటికి వెళ్లి మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదు. చుట్టుపక్కల వెతికిన సమాచారం తెలియకపోవడంతో కృష్ణయ్య మేడి పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.ఇట్టి వ్యక్తి కనిపిస్తే మేడిపల్లి పోలీస్ వారికి సమాచారం ఇవ్వగలరని సీఐ గోవిందరెడ్డి తెలిపారు.