ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఉగాది సంబరాలు
19-03-2026 12:59 AM
నాగర్ కర్నూల్, మార్చి 18 ( విజయక్రాంతి ) : ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఉగాది పండుగను బుధవారం విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రాంగణాన్ని అలంకరించి ఉగాది పచ్చడి తయారు చేసి పండుగ ప్రత్యేకతను ఆస్వాదించారు. తెలుగు విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మదన్ మోహన్, ఏవో మొహమ్మద్ ఇర్ఫాన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




