02-06-2025 01:10:03 AM
మాస్కో, జూన్ 1: రష్యాలో ఉన్న వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ విరుచుకుపడింది. పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడులకు దిగింది. తూర్పు సైబీరియా సరిహద్దుల్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా సుదీర్ఘంగా ప్రయాణించే సామర్థ్యం ఉన్న డ్రోన్లను ప్రయోగించింది. ఉక్రెయిన్ భారీ దాడులకు తెగబడ్డట్టు ఇర్కుట్స్ గవర్నర్ ధ్రువీకరించారు. ఒలెన్యా, బెలయాతో పాటు మరో రెండు మిలటరీ వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ దాడులు చేసినట్టు తెలిపారు.
ఉక్రెయిన్ దాడుల్లో 40కి పైగా రష్యా ఎయిర్క్రాఫ్ట్లు ధ్వంసం అయినట్టు ఉక్రెయిన్ మీడియా సంస్థలు తెలిపాయి. రష్యా యుద్ధం మొదలైన నుంచి కీవ్ ఇంత పెద్ద ఎత్తున దాడులకు దిగడం ఇదే తొలిసారి. రష్యాతో పోల్చుకుంటే ఉక్రెయిన్ వద్ద భారీ ఆయుధాలు లేవు. ఈ ఆపరేషన్కు స్పైడర్స్ వెబ్ అని కోడ్ నేమ్ పెట్టినట్టు సమాచారం. చెక్క షెడ్స్ చాటున దాచి ఉక్రెయిన్ డ్రోన్స్ను రష్యా స్థావరాల వద్దకు తరలించారు.