బంగ్లాదేశ్కు ఐరాస బృందం
16-08-2024 01:09 AM
ఐరాస, ఆగస్టు 15: ప్రజా తిరుగుబాటుతో అల్లకల్లోలంగా మారిన బంగ్లాదేశ్లో విద్యార్థుల ఆందోళన సందర్భంగా నిరసనకారుల హత్యలపై వాస్తవాలు తెలుసుకొనేందుకు నిజనిర్ధారణ కమిటీని పంపనున్నది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ గురువారం ఎక్స్లో ఈ మేరకు సందేశం పోస్ట్ చేశారు. ‘జూలై, ఆగస్టులో విద్యార్థుల విప్లవం సందర్భం గా జరిగిన నేరాలను విచారించేందుకు వచ్చేవారం ఐరాస ఒక నిజని ర్ధారణ కమిటీని బంగ్లాదేశ్కు పంపనున్నది. బుధవారం ఈ విషయాన్ని ఐరాస మానవహక్కుల సంఘం డైరెక్టర్ ఓల్కర్ టర్క్ మహ్మద్ యూనస్ కు తెలియజేశారు’ అని ఆ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. 1971లో బంగ్లాదేశ్కు పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐరాస నిజనిర్ధారణ బృందాన్ని పంపటం ఇదే మొదటిసారి.




