18-05-2025 12:00:00 AM
- విజేతగా ఛత్రపతి శివాజీ బాయ్స్ టీమ్
- హాజరైన సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ ఆనంద్
ముషీరాబాద్’ మే 17 (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ ఆధ్వర్యంలో నివి చారిటబుల్ ట్రస్టు సౌజన్యంతో నిర్వహించిన గాంధీనగర్ అండర్ 14 పిల్లల క్రికెట్ టోర్నమెంట్ శనివారం ముగిసింది. విజేతగా ఛత్రపతి శివాజీ బాయ్స్ టీమ్ నిలిచారు.
గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ టోర్నీలో మొత్తం16 టీంలు పాల్గొనగా ఫైనల్ మ్యాచ్ లో ఐకాన్ స్టార్స్ టీం రన్నరప్ గా నిలిచారు. గెలుపొందిన టీమ్ కు రూ.10 వేల నగదు బహుమతి, ట్రోఫీ అందచేయగా, రన్నరప్ టీంకు రూ. 5 వేల నగదు, బహుమతులను సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ ఆనంద్, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ చేతుల మీదుగా అందచేశారు. టోర్నమెంట్లో పాల్గొన్న అందరికీ సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ ఆనంద్ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల్లో రాణించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్నారు. క్రీడలు మానసికల్లాసానికే కాకుండా శారీరక దారుఢ్యానికి దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మాజీ క్రికెటర్ వెంకట్ ప్రతాప్, ఓబీసీ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు పూస రాజు, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, మద్దూరి శివాజీ, బీజేపీ డివిజన్ అద్యక్షుడు వి.నవీన్ కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.