16 June, 2026 | 2:38 AM

టీఎన్జీవో కేంద్రం సంఘంతో యూనియన్ నేతల భేటీ

16-06-2026 12:00 AM

అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాల నాయకులు

హైదరాబాద్, జూన్ 15(విజయక్రాంతి): తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ హైదరాబాద్ జిల్లా యూనియన్ అధ్యక్షులు ఎస్. విక్రమ్ కుమార్, కార్యదర్శి కురాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా సంఘం ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ ఆసుపత్రులు, శాఖల యూనియన్ నాయకులు కలిసి టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగ దీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎమ్. హుస్సేని (ముజీబ్)లను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రస్తుతం జరుగు తున్న బదిలీల్లో హైదరాబాద్ జిల్లాలోని టీఎన్జీఓస్ యూనియన్ కార్యవర్గ సభ్యులు ఎక్కడికక్కడ తమ ప్రస్తుత పని ప్రదేశాలల్లోనే కొనసాగేలా కేంద్ర సంఘం చేసిన అసాధారణ కృషికి గాను ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సమావేశంలో టీఎన్జీఓ కేంద్ర సంఘం కార్యవర్గ సభ్యులు ఉమ (కోశాధికారి), కొండల్ రెడ్డి (ఉపాధ్యక్షులు), నరసింహారెడ్డి (ఉపాధ్యక్షులు),శైలజ (సంయుక్త కార్యదర్శి) కూడా పాల్గొన్నారు. అలాగే జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ కేఆర్ రాజ్ కుమార్, ఈసీ మెంబర్ ముఖీమ్ ఖురేషితో పాటు ఖైరతాబాద్, అమీర్‌పేట్, కింగ్ కోఠి, జగమ్మేట్, నాంపల్లి, గోల్కొండ ఆసుపత్రుల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు,వర్క్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్, పెన్షన్ పేమెంట్, ట్రెజరీస్ డిపార్ట్‌మెంట్, నిలోఫర్ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్, మహిళా శిశు సంక్షేమ శాఖలకు చెందిన అ ధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, ఈసీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కృతజ్ఞతలు తెలిపిన అనంతరం, హైదరాబాద్ జిల్లా పరిధిలోని వైద్య ఆరోగ్య శాఖ, కార్మిక ఉపాధి, శిక్షణ శాఖలలో నిబంధనలకు విరుద్ధంగా, మానవతా దృక్పథం లే కుండా జిల్లా దాటించి బదిలీ చేసిన పలువు రు ఉద్యోగుల సమస్యలను విక్రమ్ కుమార్ కేంద్ర సంఘం నేతలకు వివరించారు. ము ఖ్యంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో (పోస్ట్-న్యూరోసర్జరీ, ఫిట్స్) బాధపడుతున్న అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్లు సెక్టార్ పరిధి దాటకుండా చూడాలని,

అలాగే భర్త హైదరాబాద్‌లో పనిచేస్తూ భార్యను అన్యాయం గా సంగారెడ్డికి బదిలీ చేసిన ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 లాంటి వారిని తిరిగి డెప్యుటేషన్‌పై హైద రాబాద్‌కు తీసుకువచ్చేలా ప్రభుత్వంపై ఒత్తి డి తెచ్చి న్యాయం చేయాలని కేంద్ర సంఘం నాయకత్వాన్ని కోరారు. దీనిపై టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ సానుకూలంగా స్పందిస్తూ.. ఈ సమస్యలను వెంటనే సదరు శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, డైరెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి, ఉద్యోగులందరికీ త్వరలోనే న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.