మునుగోడులో ఆంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ
మునుగోడు, మార్చి 27 : మునుగోడు పట్టణంలో శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా శుక్రవారం భక్తులు ప్రసన్నాంజనేయ స్వామి 15 అడుగుల ఎత్తున విగ్రహమును ఆవిష్కరింపజేశారు. కార్యక్రమంను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రారంభిం చారు. అనంతరం హనుమాన్ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో తన సతీమణి లక్ష్మితో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం మునుగోడు పట్టణంలోని పురాతన శివరామ ఆలయంను, కొంపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయం, కొంపల్లి శివారు తూర్పు గూడెం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, చీకటి మామిడి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాల్లో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.




