calender_icon.png 11 September, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ పాలనలో తిరుగులేని తెలంగాణ

04-09-2025 01:06:15 AM

  1. కాంగ్రెస్ పాలనంతా అవినీతి మయం
  2. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి

మేడిపల్లి సెప్టెంబర్ 3:మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రధాత కెసిఆర్ ఎన్నో పోరాటాలు చేసి తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ సాధించాడని కానీ ఎన్నో కలలు కని తెచ్చుకున్న తెలంగాణ ద్రోహుల చేతిలో చిక్కి విలవిలలాడుతుందని మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ...

కెసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన సమయం లో అనేకమంది విభేదించారని ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్ విడిపోతే తెలంగాణ ప్రాంత ప్రజ లు అన్ని రంగాల్లో వెనుకబడిపోతారని కరెం టు ఉండదని వ్యవసాయం వెనుకబడుతుందని నక్సలిజం పెరిగి అభివృద్ధి పనులు జర గవని విమర్శించాలని గుర్తు చేశారు. ఇటువంటి విమర్శలు చేసిన అనేకమంది నేడు అధికారంలో కొనసాగుతూ తెలంగాణను అన్ని రంగాల్లో బ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ సాధించిన నాయకుడి గా కేసీఆర్‌ను గుర్తించిన ప్రజలు 10 సంవత్సరాల పాటు ఆయనను ముఖ్యమంత్రి కు ర్చీలో కూర్చోబెట్టారని, అందుకు తగ్గట్టుగా పనిచేసిన కేసిఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లారని, రైతుబంధు రైతు బీమా, వంటి వినూత్న సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను ఆదుకున్నారని కొనియాడారు. రాష్ట్రంలో ఉన్న తీరుగా నే బోడుప్పల్ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సైతం అవినీతి రాజ్యమేలుతుందని,

పదవీకాలం ముగిసినప్పటికీ మాజీ మేయర్లు కార్పొరేటర్లు అన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తమకు నచ్చిన విధంగా పనులు చేసుకుంటున్నారని, రెండు మున్సిపాలిటీల పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ డబ్బు లు దండుకుంటున్నారని ఆరోపించారు.

అధికారుల తీరు మారకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, నాయకులు రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.