18 July, 2026 | 12:11 PM

Breaking News

విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •   సోనమ్ వాంగ్‎చుక్ దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు   •  

యూరియా కొరత..రోడ్డుపై బైఠాయించిన రైతులు

04-09-2025 12:52 AM

పెద్ద కోడప్గల్, సెప్టెంబర్ 3 ః పెద్ద కొడప్గల్ రైతులకు సరిపడా యూరియాను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని పెద్ద కోడప్ గల్ భారతీయ కిసాన్ సంఘం గ్రామ అధ్యక్షులు కుమార్ సింగ్ పేర్కొన్నారు. బుధవారం రోజున పెద్ద కోడప్ గల్ మండల కేంద్రం లో రోడ్డు పై రైతులు ధర్నా చేయడం జరిగింది. అనంతరం నాయబ్ తహసిల్దార్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా కుమార్ సింగ్ మాట్లాడుతూ... రైతులకు సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడం తో రైతంగం చాలా ఇబ్బంది లో ఉందన్నారు.

యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి యూరియా ను అందుబాటులో తెచ్చి రైతుల సమస్యను పరిష్కరించి యూరియా కొరత లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమం లో పెద్ద కోడప్ గల్ గ్రామ కిసాన్ సంఘం అధ్యక్షులు కుమార్ సింగ్, మండల కార్యదర్శి బోడి రాజు యాదవ్, మండల సహాయ కార్యదర్శి బోడి మళ్ళీ కార్జున్, మండల అధ్యక్షులు జైత్రం, బాన్స్వాడ డివిజన్ సభ్యులు దేవి సింగ్, మొలుగు సంజీవ్ రెడ్డి,గ్రామ ఉపాధ్యక్షులు అప్రోజ్, జక్కుల అంజయ్య,రైతులు పాల్గొన్నారు.