27 March, 2026 | 6:45 PM

తుజాల్‌పూర్ గ్రామానికి వైకుంఠ రథం అందజేత

27-03-2026 05:09 PM

బీబీపేట్,(విజయక్రాంతి): బిబిపెట్ మండలం తుజాల్‌పూర్ గ్రామ ప్రజలకు అంత్యక్రియల సమయంలో సౌకర్యం కల్పించేందుకు వైకుంఠ రథాన్ని గురువారం గ్రామానికి అందజేశారు. గ్రామానికి చెందిన దాతలు పెనుబెల్లి సుధాకర్ రెడ్డి, పెనుబెల్లి వెంకట్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముగ్గురు సోదరులు కలిసి తమ తండ్రి పెనుబెల్లి నారాయణరెడ్డి జ్ఞాపకార్థం ఈ రథాన్ని గ్రామానికి సమర్పించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ... గ్రామ ప్రజలకు అంత్యక్రియల సమయంలో ఈ రథం ఎంతో ఉపయోగకరంగా ఉండి, అవసర సమయంలో సహాయపడుతుందని తెలిపారు.

గ్రామాభివృద్ధి కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు దాతలను అభినందిస్తూ, గ్రామానికి అవసరమైన సదుపాయాన్ని అందించడంపై కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధికి దాతలు ముందుకు రావడం ఆనందకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తలారి ప్రవిత-శ్రీనివాస్, ఉపసర్పంచ్ రంగయ్య లక్ష్మారెడ్డి, దాతలు పెనుబెల్లి సుధాకర్ రెడ్డి, పెనుబెల్లి వెంకట్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్, మాజీ సర్పంచ్ చెల్లాపురం వెంకట్ గౌడ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.