01-01-2026 02:34:17 AM
బాన్సువాడ, డిసెంబర్ 31 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని వాసవి ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం సెల్ ఫోన్ ను తెలివిగా ఉపయోగించడం ఎలా అనే అంశంపై అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలందరూ చక్కగా పాల్గొని సెల్ ఫోన్ వినియోగంపై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ఇందులో భాగంగా పిల్లలు నృత్య ప్రదర్శనలతో, నినాదాలతో ప్రజలకు సెల్ ఫోన్ ను అనవసర విషయాలకు కాకుండా మన అవసరానికి ఏ విధంగా ఉపయోగించాలో అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు బి. లక్ష్మీ శ్వేత, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.