కొమ్మిడి నర్సింహారెడ్డికి వేదకుమార్ నివాళి
మూసీ నది పరిరక్షణ ఉద్యమంలో చురుకైన పాత్ర
ముషీరాబాద్, జూలై 7 (విజయక్రాం తి): భువనగిరి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ ప్ర జా నాయకుడు కొమ్మి డి నర్సింహా రెడ్డి మృతి పట్ల తెలంగాణ రిసోర్స్ సెంటర్ చైర్మన్ వేదకుమార్ మణికొండ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సేవ, సామాజిక సేవ పట్ల ఆయనకున్న అం కితభావం, నిరాడంబర వ్యక్తిత్వం చిరస్మరణీయమని పేర్కొన్నారు. మూసీ నది పరిరక్షణ ఉద్యమంలో కొమ్మిడి నర్సింహారెడ్డితో తన కు సుదీర్ఘ అనుబంధం ఉందని వేదకుమార్ తెలిపారు.
మూసీ నది సంరక్షణ, పునరుజ్జీవనానికి సంబంధించిన అనేక కార్యక్రమా లు, చర్చలు, అవగాహన సదస్సుల్లో ఆయన చురుకుగా పాల్గొని పర్యావరణ పరిరక్షణపై విలువైన సూచనలు అందించారని గుర్తుచేశారు. ఆయన మరణంతో ప్రజా జీవితంలో నిబద్ధత కలిగిన నాయకుడిని, పర్యావరణ ఉద్యమానికి అండగా నిలిచిన ఆత్మీయ మిత్రుడిని కోల్పోయామని వేదకుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొమ్మిడి నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.






