03-11-2025 01:38:34 AM
							చేర్యాల, నవంబర్ 02:సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఆదివారం శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 417 వ జయంతిని పురస్కరించుకొని మహామాయ దేవి ఆలయంలో కొలువుదీరిన వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో విశ్వబ్రాహ్మణ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష అభిషేకం, అర్చనలు, స్వామివారి మూల మంత్ర హోమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మే ర్గోజు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి రాళ్లబండి భాస్కర్, గౌరవాధ్యక్షులు రాళ్లబండి నాగరాజు, పోలోజు శ్రీహరి, మేర్గోజు నారాయణ, మేర్గోజు రామచంద్రం, వినోద్, మేర్గోజు జనార్ధన్, మేర్గోజు మహేష్ తదితరులు పాల్గొన్నారు.