11 April, 2026 | 8:30 PM

ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన వెంకట్ ప్రసాద్

27-10-2025 06:47 PM

ధర్మపురి (విజయక్రాంతి): వెల్గటూర్ మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారిగా పాడి వెంకట్ ప్రసాద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మండల అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల ముఖ్య నాయకులు సహకరించాలనీ ఆయన తెలిపారు. మండల అభివృద్ధికి ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉంటూ మండలాన్ని అందరి సహకారంతో అభివృద్ధి పథములో ముందుకు నడిపిస్తామనీ ఆశాభావం వ్యక్తం చేశారు.