6 May, 2026 | 9:23 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

ఎన్‌హెచ్‌ఆర్సీకి ‘సున్నంచెరువు’ బాధితులు

12-09-2024 12:26 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 11 (విజయక్రాంతి): తాము హైదరాబాద్‌లోని మాదాపూర్ సున్నంచెరువు ప్రాంతంలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నామని, తమకు ఎలాంటి ఫిర్యాదులు ఇవ్వకుండానే హైడ్రా గుడిసెలను కూల్చివేసిందని బాధితులు బుధవారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తమకు వెంటనే రాష్ట్రప్రభుత్వం ద్వారా పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబాలు 15 ఏళ్ల నుంచి సున్నం చెరువు ప్రాంతంలో  ఉంటున్నాయన్నారు.  నష్టపోయిన పేదలకు  సర్కార్ నుంచి పరిహారం ఇప్పించాలని, బాధితులపై పోలీసులు నమో దు చేసిన కేసులను ఉపసంహరించేలా చూడాలన్నారు.