24-06-2025 12:38:26 AM
ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
రూ. 2.46 లక్షలతోఅభివృద్ధి పనులు ప్రారంభం
యాచారం జూన్ 23 : కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని మంతన్ గౌరెల్లి ,మాల్, నల్లవెల్లి, తమ్మలోని గూడ, చింతపట్ల గ్రామాలలో రూ. 2.46 లక్షలతో అండర్ డ్రైనేజ్, సిసి రోడ్లు, అంగన్వాడి భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాలలో మౌలిక వసతులు కల్పించడంలో తమ ప్రభుత్వం ముందు ఉంటుందని, అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.
అర్హులైన అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని, అందులో భాగంగానే ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిందని అన్నారు. మాల్ అంగడి సంత స్థలం కోసం 640 సర్వేనెంబర్ లో 4 ఎకరాలు కేటాయించాల్సిందిగా తహసిల్దా ర్ అయ్యప్పకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాల్ మాజీ సర్పంచ్ పడకండి కవిత శేఖర్ గౌ డ్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లిక్కి రాజారెడ్డి, మాజీ సర్పంచ్ లు చిన్నోళ్ల పద్మ, జాంగిర్, బెల్లీ జంగయ్య యాదవ్, మాజీ ఉపసర్పంచ్ గేనముని మాధవి గోపాల్, గ్రామ శాఖ అధ్యక్షుడు గిరి గాలయ్య, తదితరులుపాల్గొన్నారు.