07-01-2026 05:20:03 PM
మద్నూర్,(విజయ క్రాంతి): మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, పాలకర్గానికి అంగన్వాడీల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. మద్నూర్ మండల కేంద్రంలో 9 అంగన్వాడి సెంటర్ల టీచర్లు ఈ సన్మాన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీడీపీఓ కళావతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సాందర్బంగా కళావతి మాట్లాడుతూ.. నూతన పంచాయితీ పాలకవర్గం అంగన్వాడీల ప్రగతికి పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని ఈ సందర్భంగా వారు కోరారు. అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం నిధులు వచ్చాయని, కొన్ని సెంటర్లకు మరుగుదొడ్లు, ముత్రశాల నిర్మాణంకు నిధులు మంజూరైనట్లు ఆమె తెలిపారు.