గో డిజిట్ ఫ్లాట్ లిస్టింగ్
24-05-2024 12:05 AM
ముంబై, మే 23: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, ఆయన సతీమణి, సినీనటి అనుష్క శర్మలకు పెట్టుబడులు ఉన్న డిజిటల్ ఇన్సూరెన్స్ కంపెనీ గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ షేర్లు గురువారం స్టాక్ ఎక్సేంజీల్లో ఫ్లాట్ గా లిస్టయ్యాయి. ఐపీవోను షేరుకు రూ.272 ధరతో జారీచేయగా, ఎన్ఎస్ఈలో ఇది రూ.280 వద్ద లిస్ట య్యింది. ఇంట్రాడేలో రూ.314 వర కూ పెరిగిన ఈ షేరు చివరకు రూ.305 వద్ద ముగిసింది. లిస్టింగ్ ధరతో పోలిస్తే ముగింపులో గో డిజి ట్ ఐపీవో ఇన్వెస్టర్లకు 6 శాతంపైగా లాభాలను తెచ్చిపెట్టింది. ఈ కంపెనీ జారీచేసిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) 10 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది.






