15 April, 2026 | 12:31 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రక్తదానం చేసి మానవత్వం చాటిన వార్డు సభ్యుడు మహేష్

23-02-2026 06:04 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తహీనతతో బాధపడుతున్న ఓ మహిళకు సమయానికి రక్తం అందక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో మండలంలోని ఎదులవాడ గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు మహేష్ మానవత్వాన్ని చాటుకున్నారు. సోషల్ మీడియాలో మహిళ ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన సమాచారం తెలుసుకున్న వెంటనే స్పందించిన ఆయన, ఆసుపత్రికి చేరుకుని స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారు.

రక్తహీనతతో బాధపడుతున్న మహిళకు అత్యవసరంగా రక్తం అవసరమని వైద్యులు సూచించగా, ఆలస్యం చేయకుండా ముందుకు వచ్చిన మహేష్ తన బాధ్యతను సామాజిక సేవగా భావించి రక్తం అందించారు. ఆయన చర్యతో మహిళ ఆరోగ్య పరిస్థితి స్థిరపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మహేష్ చేసిన ఈ సేవాస్ఫూర్తిని స్థానిక ప్రజలు, యువకులు, ఆసుపత్రి సిబ్బంది అభినందించారు.

ప్రజా ప్రతినిధులు కేవలం పరిపాలనా కార్యక్రమాలకు మాత్రమే కాకుండా, అవసరమైన సమయంలో ముందుండి సేవ చేయాలని ఆయన నిరూపించారని పేర్కొన్నారు. రక్తదానం మహాదానం అనే నినాదాన్ని సార్థకం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచిన మహేష్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అవసర సమయంలో ఒక్క అడుగు ముందుకు వేస్తే ఒక ప్రాణం కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావాలని పలువురు పిలుపునిచ్చారు.