2 May, 2026 | 8:48 PM

Breaking News

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •   సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?   •   బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి   •   అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు   •   మాల్ తుమ్మెదలో.. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన స్వరూప కాటం   •   కొత్తా సీతారాములుకు శ్రమశక్తి అవార్డు   •  

24 నుంచి వారబందీ ప్రకారం నీటి విడుదల

09-12-2025 12:00 AM

నిజామాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా యాసంగి పంటలకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఎస్సీ జగదీష్ తెలిపారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో  జరిగిన ఎస్సీ ఐడబ్ల్యూ ఎ ఎమ్ కమిటీ నిర్ణయించిన ప్రకారం ఈ నెల 24 నుండి ఉదయం 10 గంటలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి కాకతీయ సరస్వతి లక్ష్మీ కాలువల ద్వారా ఈ సంవత్సరం యాసంగి పంటకు సాగునీటి నీ విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఎస్సీ ఐ డబ్ల్యూ కమిటీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు వారబంధి పద్ధతిలో సాగునీటి విడుదల కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. సాగునీరు వృధా కాకుండా పొదుపుగా వాడుకోవాలని రైతంగానికి ఆయన విజ్ఞప్తి చేశారు.