09-12-2025 12:00:00 AM
నిజామాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా యాసంగి పంటలకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఎస్సీ జగదీష్ తెలిపారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఎస్సీ ఐడబ్ల్యూ ఎ ఎమ్ కమిటీ నిర్ణయించిన ప్రకారం ఈ నెల 24 నుండి ఉదయం 10 గంటలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి కాకతీయ సరస్వతి లక్ష్మీ కాలువల ద్వారా ఈ సంవత్సరం యాసంగి పంటకు సాగునీటి నీ విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఎస్సీ ఐ డబ్ల్యూ కమిటీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు వారబంధి పద్ధతిలో సాగునీటి విడుదల కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. సాగునీరు వృధా కాకుండా పొదుపుగా వాడుకోవాలని రైతంగానికి ఆయన విజ్ఞప్తి చేశారు.