ఆస్పత్రి ఆవరణలో కుక్కలు ఉండకుండా చేస్తున్నాం
27-03-2026 12:25 AM
జిల్లా ప్రధాన జనరల్ హాస్పిటల్ సూపర్టెండెంట్ రంగా అజ్మీరా
మహబూబ్ నగర్ టౌన్, మార్చి 26: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన రోగులను కుక్కలు కరిచిన ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం తక్షణమే స్పందించిందని ఆస్పత్రి సూపర్కంటెంట్ డాక్టర్ రంగా అజ్మీర అన్నారు.
సిబ్బంది మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమన్వయం చేసుకుని ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, నిరంతరం 24 గంటల పాటు శ్రమించి ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న కుక్కలను గుర్తించి, ఇప్పటివరకు 3 కుక్కలను పట్టుకొని సురక్షితంగా తరలించినట్లు పేర్కొన్నారు. రోగులు, బంధువుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు మరింత కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయన్నారు.




