14-06-2025 12:00:00 AM
ఎమ్మెల్యే తూడిమేఘారెడ్డి
వనపర్తి, జూన్ 13 (విజయక్రాంతి) : ప్రజల అవసరాలను గుర్తించి సకాలంలో సమకూరుస్తు వస్తున్నామని ఇది ప్రజా ప్రభుత్వం అని ఎమ్మెల్యే మేఘా రెడ్డి అన్నారు. శుక్రవారం పెబ్బే రు,శ్రీరంగాపురం మండలాలలో పర్యటించారు. ముందుగా శ్రీరంగాపురం మండలంలోని శేరుపల్లి గ్రామంలో రూ.20 లక్షల అంచనా వ్యేయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవ నంను ప్రారంభించి, అనంతరం అయ్యవారిపల్లి గ్రామంలో నిర్వహించిన బడిబాట,అక్షరాభ్యా సం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు... రాష్ట్ర ప్రభుత్వం విద్యా,క్రీడా రంగాలను బలోపేతం చేసేందుకు, గ్రామాలలో మౌళిక వసతుల కలపన పై ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా విద్యా కమిషన్ ను ఏర్పాటు చేసి, ప్రణాళికా బద్దంగా ముందుకెళ్తూ పాఠశాలల పునః ప్రారంభం రోజు కన్నా ముందే పాఠశాలల కు పాఠ్యపుస్తకాలు, నోటబుక్కులు, ఏకరూప దుస్తులు చేరిపోవడం,పాఠశాలల ప్రారంభంరోజే విద్యార్థులకు అందజేయడం ఇందుకు నిదర్శనం అన్నారు.
అనంతరం అయ్యవారిపల్లి గ్రామం లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణపనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మా ర్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ , పెబ్బేర్ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు ప్రమోదిని రెడ్డి ఉ పాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, ఆయా మండల నాయకులు పాల్గొన్నారు.