25-06-2025 12:58:24 AM
కామారెడ్డి/ఎల్లారెడ్డి, జూన్ 24 (విజయ క్రాంతి): గత పాలకుల పాలనలో ఆర్టీసీ నీ పట్టించుకోలేదని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీకి మంచి రోజులు వచ్చా యని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నూతన బస్టాండ్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి బస్టాండ్ గత పాలకుల హాయంలో ఎంతో అద్వానంగా మారిందని ఎల్లారెడ్డి బస్టాండ్ ను పట్టించుకున్న పాపాన గత పాలకులు పోలేదని, ఇరుకు రోడ్డు, గుంతలతో క పలుషితమైన నీరుతో కలిగి ఉన్న బస్టాండు పునర్నిర్మానం కొరకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఎంతో కృషి చేశారని అన్నారు.
బస్టాండు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి గురించి ఎమ్మెల్యే మదన్మోహన్ ఎప్పుడు సచివాలయంలో సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడుతూ తెలియపరుస్తుంటారని అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ వెనుకబడిన తరగతి ప్రాంతం ఎల్లారెడ్డి నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధిత శాఖ మంత్రులు కృషి చేయాలని పలుమార్లు మంత్రులతో ఎప్పుడు చర్చిస్తారని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలవుతున్నాయని ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మంత్రి కొనియాడారు. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం, ప్రజలకు సన్న బియ్యం పథకం, ఫీజు రియంబర్స్మెంట్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, భూ సమస్యలను పరిష్కరించేందుకు భూభారతి పథకం ద్వారా పరిష్కారం జరుగుతున్నాయని అన్నారు.
ప్రజలకు ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వం తరఫున సంక్షేమ ఫలాలు ఎన్నో అందుతున్నాయని కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులనుకోరారు.
అనంతరం ఎమ్మెల్యే మదన్మోహన్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి శరవేగంగా నడుస్తుందని నాలుగు కోట్ల 50 లక్షలు రూపాయలతో నూతన బస్టాండ్ నిర్మాణం జరుపుకున్నామని త్వరలోనే వంద పడకల ఆసుపత్రి అందుబాటు లోకి రానుందని నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మంజూర అయిందని ఎమ్మెల్యే మదన్మోహన్ కొనియాడారు.
అలాగే ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో బస్ డిపో ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యే మదన్మోహన్ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను సభా వేదికగా కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి ఆర్టీసీ డిపో మంజూరుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ శర్మ, కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఎల్లారెడ్డి ఆర్టీవో వీణ,
ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు, ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, ఎల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉపాధ్యక్షుడు ప్రశాంత్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కురుమ సాయిబాబా, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.