14-01-2026 01:56:49 AM
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం
హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): తెలుగు ప్రజలందరికి ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను అందించే భోగి, కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి, కనుమ పండుగలను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధ్ది పథకాలన్ని రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి చేరాలనేది తమ సంకల్పమన్నారు.
వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, ఉత్పత్తులు, సేవల రంగంలో తెలంగాణ రాష్ట్రం తిరుగులేని పురోగతిని సాధిస్తుందనే నమ్మకం తనకుందన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలందరూ సంతోషంగా తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి పండుగ సంబురాలు జరుపుకోవాలన్నారు. పతంగులు ఎగరవేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.