10-06-2025 08:30:21 PM
ఆర్డీవో కృష్ణవేణి..
మహబూబాబాద్ (విజయక్రాంతి): భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి-2025 ఆర్ఓఆర్ చట్టం అమలులో భాగంగా గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మహబూబాబాద్ ఆర్డిఓ కృష్ణవేణి(RDO Krishnaveni) కోరారు. జిల్లావ్యాప్తంగా వివిధ గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కొత్తగూడా మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న భూభారతి సదస్సులను ఆర్డిఓ సందర్శించారు. భూ సమస్యలు ఉన్న రైతులు తమ వివరాలతో కూడిన దరఖాస్తులను సదస్సులో అధికారులకు అందజేయాలని, దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలకు పరిష్కారం చూపుతారని చెప్పారు. ఈ సందర్భంగా దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను ఆర్డీవో పరిశీలించారు.