నీటిని పొదుపుగా వాడుకోవాలి
23-03-2026 02:28 PM
సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్
దేవరకొండ,(విజయక్రాంతి): వేసవికాలంలో ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ అన్నారు. సోమవారం దేవరకొండ మండలంలోని మైనంపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామసభలో మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడు ప్రజలకు వ్యాధులు రాకుండా అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారు అని అన్నారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ లాలు.పంచాయతీ కార్యదర్శి అంబేద్కర్. వార్డు సభ్యులు కొర్ర లక్ష్మీ ప్రశాంత్. కొర్ర సునీత బద్దు.పులిజలా సంతోష వెంకట్.కొర్రకిషన్.ప్రధానోపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి. అంగన్వాడీ టీచర్ బుజ్జి. కలమ్మ. ఏ ఎన్ ఎం విజయ. ఆశ కార్యకర్త ధనమ్మ. అలివేలు. తదితరులు పాల్గొన్నారు.




