31-05-2025 12:17:46 AM
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్, మే 31: ఇల్లు లేని ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం నిజాంపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, పేదవాడికి కడుపు నింపేందుకు సన్నబియ్యం అందజేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల పనిచేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని అన్నారు.
కార్యక్రమంలో ఎంపీడీవో సంగ్రామ్ హౌసింగ్ అధికారులు, స్థానిక నాయకులు శంకర్ గౌడ్ రాధాకిషన్ సెట్, లింగారెడ్డి మాజీ ఎంపిటిసి, శంకర్ ,జింకల వెంకటేశం, మీ స్కిన్, పాటిల్ , కృష్ణ ,సుదర్శన్, ప్రదీప్ గౌడ్ స్థానిక నాయకులు, అధికారులుపాల్గొన్నారు.