calender_icon.png 1 June, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా హితమే పరమావధిగా స్వచ్ఛంద సంస్థలు పని చెయ్యాలి: ఏసీపీ మాధవి

31-05-2025 12:17:33 AM

హుజురాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలు ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలంటే ఆయా ప్రభుత్వ శాఖల అధికార యంత్రాంగంతొ పాటు స్వచ్ఛంద సంస్థల పాత్ర ఎంతో అవసరమని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని శుక్రవారం పీవీ సేవా సమితి ప్రతినిధులతో, సిద్దార్థ్ నగర్ సొసైటీఅధ్యక్షులు సాగి వీర భద్ర రావు ఏసీపి కార్యాలయంలో నూతనంగా ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన మాధవిని శాలువాతో సన్మానించి బోకెను అందించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాధవి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి స్వచ్ఛంద సంస్థలు వారధిగా పని చేస్తున్నాయని, దేశ పురోభివృద్ధిలో వాటి పాత్ర ఎంతో గాను  ఉపయోగపడతాయన్నారు.