24-06-2025 01:49:00 AM
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
మాస్కో, జూన్ 23: ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్కు తమ వంతు సాయం అందిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లా దిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సోమవారం రష్యాకు వెళ్లిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాస్కోలో పుతిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ పంపిన సందేశాన్ని పుతిన్కు వివరించారు.
ఈ క్రమంలో యుద్ధంలో ఇరాన్కు సాయం చేసేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని పుతిన్ తెలిపారు. ఇరాన్పై అమెరికా దాడులు చేయడం ముమ్మా టికీ తప్పేనని.. ఇరాన్ ప్ర బజలకు రష్యా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
అందుకే సాయం చేయలేదు
కొద్ది రోజుల నుంచి ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు జరుగుతున్నా కానీ రష్యా మాత్రం నిశబ్దంగా ఉంటూ వస్తోంది. దీనిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా స్పందించారు. ‘సోవియట్ యూనియన్ రష్యన్ ఫెడరేషన్కు చెందిన దాదాపు 20 లక్షల మంది ప్రజలు ఇజ్రాయెల్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం అది రష్యన్ మాట్లాడే దేశం. మేము వారిని తప్పకుండా పరిగణలోనికి తీసుకుంటాం. అందుకోసమే తటస్థంగా ఉంటున్నాం.’ అని తెలిపారు.