03-06-2025 04:28:52 PM
అడిషనల్ కలెక్టర్ వేణు గోపాల్..
ములకలపల్లి (విజయక్రాంతి): రెవిన్యూ సదస్సుల ద్వారా ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కరిస్తామని అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్(Additional Collector Venugopal) తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని కమలాపురంలో రెవిన్యూ సదస్సుల నిర్వహించారు. ఈసదస్సులో ఆయన పాల్గొన్నారు. ఇంతకు ముందు ఉన్న ధరణికి బదులు ప్రభుత్వం భూ భారతి తీసుకొచ్చిందన్నారు. దీని ద్వారా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు పరిష్కరించబడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఈ రెవిన్యూ సదస్సు ద్వారా దరఖాస్తు చేసుకుంటే వివిధ స్థాయిలలో ఆ సమస్యలు తప్పకుండా పరిష్కారం అవుతాయని, ప్రజలు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. తహసీల్దార్ గనియా,రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు