03-05-2025 06:42:03 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా జాక్రాన్ పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్మల్ జిల్లా పెంబి మండలానికి చెందిన ఇద్దరు అక్క చెల్లెలు మృతిచెందగా వారి కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చెప్పినట్టు ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ నాయక్ తెలిపారు. పరీక్ష రాయడానికి వెళ్ళిన ఇద్దరు అక్క చెల్లెలు మృతిచెందగా తండ్రి గల్ఫ్ లో ఉన్నందున వెంటనే ఆయనను ఇంటికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జాన్సన్ నాయక్ తెలిపారు.