కొమురంభీం ఆసిఫాబాద్, మే 1 (విజయక్రాంతి): దేశసేవ చేసి పదవీ విరమణ పొందిన జవాన్లకు రిటైర్డ్ ఆర్మీ అసోసీయేషన్ సభ్యులు ఘనస్వాగతం పలికారు. బెంగళూరూ ఏఎస్సీలో విధులు నిర్వహిం చి, ఏప్రిల్ 30న గోకుల్ మిస్త్రీ, ధనుంజయ్ సర్కార్లు రిటైర్డ్ అయ్యారు. ఈ నేపథ్యంలో బుధ వారం మధ్యాహ్నం సికింద్రాబాద్ పాట్నా ఎక్స్ప్రెస్లో తమ సొంత ఊరు కాగజ్నగర్కు చేరుకున్నారు. కాగజ్ నగర్ రైల్వేస్టేషన్లో వారిద్దరికి అసోసియేషన్ సభ్యులు స్వాగతం పలికి, పూలమాలలతో సత్కరించి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో జవాన్ల కుటుంబ సభ్యులు, రిటైర్డ్ అసోసీయేషన్ అధ్యక్షుడు శివానాయక్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.