09-06-2025 01:27:21 AM
కార్పొరేటర్ ఎ పావని వినయ్ కుమార్
ముషీరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): ప్రధాని మోది పదకొండు ఏళ్ల పాలనలో విజయాలను, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆదివారం గాంధీనగర్ డివిజన్ అశోక్ నగర్ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో డివిజన్ బీజేపీ కార్యవర్గ సమావేశం డివిజన్ అధ్యక్షుడు వి. నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ పాల్గొని పార్టీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. డివిజన్ లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ పదకొండు సంవత్సరాల పాలనలో సాధించిన విజయాలను,కేంద్ర ప్రభుత్వ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను నాయకులు,కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని అన్నారు.
రానున్న ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయాన్ని అందించి,మేయర్ స్థానా న్ని కైవసం చేసుకోవడమే కాక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ని అ ధికారంలోకి తేవడమే ధ్యేయంగా కృషి చే యాలని కార్పొరేటర్ పిలుపునిచ్చారు. అనంతరం గాంధీ నగర్ డివిజన్ బీజేపీ నూతన కమిటీకి ఎన్నికైన నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రమేష్ రామ్,సీనియర్ నాయకులు శ్రీకాంత్, వి ఎస్ టి రాజు, ఆకుల సురేందర్,శివ కుమా ర్, సత్తి రెడ్డి, విష్ణు ప్రసాద్, బాల కృష్ణ,శ్రీనివాస్ యాదవ్,విజయ లక్ష్మి, నూతన కమిటీ సభ్యులు, నాయకులు కార్యకర్తలు తదిత రులు పాల్గొన్నారు.