calender_icon.png 27 June, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సంక్షేమం

27-06-2025 02:30:02 AM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్

శాలిగౌరారం, జూన్ 26: కాంగ్రెస్ ప్రభుత్వం తోనే పేదల సంక్షేమం సాధ్యం అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తామని అన్నారు.

గురువారం శాలిగౌరారం మండలంలోని రామగిరి,లింగోటం గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగతుర్తి నియెజకవర్గం కి 3500 ఇందిరమ్మ ఇండ్లలను మంజూరు చేయించారని, తుంగతుర్తి ఎస్సీ నియోజకవర్గం ఐనందున మరి కొన్ని ఇండ్లు కావాలని అడుగుతానని అన్నారు

ఈ కార్యక్రమంలో  ఎంపిడివో జ్యోతి లక్ష్మి,తహసీల్దార్ జమీరుద్దీన్,మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్ రెడ్డి,డీసీసీ ఉపాధ్యక్షులు అన్నెబోయిన సుధాకర్,కాంగ్రెస్ మండల అధ్యక్షులు కందాల సమరం రెడ్డి,చామల వెంకట రమణారెడ్డి,గూని వెంకటయ్య,భూపతి వెంకన్న,నోముల జనార్దన్,వేముల గోపినాథ్,బోడ అరుణ్ కుమార్,లోడే సత్తయ్య,మొగుళ్ళ శ్రీనివాస్,నిమ్మల కృష్ణ మూర్తి,లోడంగి మహేష్,పుల్లూరి దేవేందర్,వంగూరి వెంకన్న,గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

 తుంగతుర్తి, జూన్ 26 : ప్రభుత్వ పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి లోకి రావాలని  ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. జిల్లాలోని నూతనకల్ మండల పరిధిలోని తాళ్ల సింగారం గ్రామంలోని నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని, ఎర్రబాడులో నూతన అంగన్ వాడి భవనాన్ని గురువారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు.

ప్రభుత్వాన్ని అందిస్తున్న సంక్షేమ పథకాలను హరులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.  ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ నాగం జయసుధ సుధాకర్ రెడ్డి ,తాసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో సునీత  నాగం సుధాకర్ రెడ్డి, దరిపెల్లి వీరన్న ఎలిమినేట్ కిష్ట ప్రశాంత్, వల్లమళ్ల జయకర్, మరికంటి అంబేద్కర్ గునిగంటి వెంకన్న ,అనంతుల శ్రీనివాస్, బంటు క్రాంతి తదితరులు పాల్గొన్నారు