సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఏమైంది
సీఎం కు మాజీ మంత్రి రామన్న సూటి ప్రశ్న..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సమగ్ర శిక్ష ఉద్యోగులకు గంటలోపు రెగ్యులర్ జీవో విడుదల చేస్తామన్నా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని మాజీ మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు కొనసాగిస్తున్న దీక్ష శిబిరాన్ని ఆయన మంగళవారం సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాజీ మంత్రి రామన్న మాట్లాడుతూ ఉద్యోగులు చేసే పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంద్దన్నారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో సమస్యలపై ప్రస్తావించేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.






