ఉద్యమకారులకు ఇచ్చిన హామీలేమయ్యాయి?
31-03-2026 01:29 AM
- అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది
- ఉద్యమకారులకు ఇంకా న్యాయం జరగలేదు
- శాసనమండలిలో ఎమ్మెల్సీ విజయశాంతి
హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్ధానాలను వెంటనే నెరవేర్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుం బాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, నెలకు రూ.25 వేల అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చామని చెప్పారు.
అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయిందని, ఉద్యమకారులకు ఇంకా న్యాయం జరగడం లేదన్నా రు. తమకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ఉద్యమకారులు అడుగుతున్నారని చెప్పారు. ఉద్యమకారులపై ఉన్న కేసులు ఎత్తివేసి, ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామన్న హామీని అమలు చేయాలని కోరారు.




