calender_icon.png 11 June, 2025 | 12:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసరి కబ్జా వీడేదెన్నడు?

10-06-2025 12:00:00 AM

  1. బయో ఫెన్సింగ్ ఏర్పాటుకు రాజకీయ గ్రహణం
  2. అమాత్య ప్రధాన అనుచరుడివే  శిఖంలో అధిక వెంచర్లు. 
  3. అక్రమ కట్టడాలను కూల్చినట్లు ఎన్జీటీకి తప్పుడు నివేదికలు.!?
  4. ఎఫ్టిఎల్ నీరు నిల్వకుండా, షట్టర్లు బిగించకుండా ధ్వంసం చేసిన అలుగు ప్రాంతం

నాగర్ కర్నూల్ జూన్ 9 (విజయక్రాంతి): భావితరాలకు జీవనాధారంగా ఉండే చెరువులు, కుంటలను నాడు కాకతీయులు నిర్మి స్తే నేడు ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకుల వెంట తిరిగే చోట మోట లీడర్లు ఆ చెరువులను ఆక్రమించి ధ్వంసం చేస్తున్నారు. చెరు వు శిఖం భూముల్లో అక్రమంగా వెంచర్లు వేసి వాటిని అడ్డగోలుగా అమ్ముకొని సొ మ్ము చేసుకున్న పరిస్థితి ఏర్పడింది.

నాగర్ కర్నూల్ కేసరి సముద్రం చెరువు పరిసర 20 గ్రామాలకు జీవనాధారంగా మిగిలేది. కానీ రోజురోజుకు ఆక్రమణదారుల చెరలో బందీ కావడంతో విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. ఫలితంగా భూగర్భ జలాలు పూర్తిగా తగ్గుము ఖం పడుతున్నాయి. చెరువులో ఎఫ్.టి.ఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ నీరు నిల్వ ఉండకుండా అలుగు ప్రాంతాన్ని ధ్వంసం చేసి షట్టర్లు బి గించకుండా అధికారులు కూడా అలసత్వం వీడకపోవడంతో వచ్చిన నీరు వచ్చినట్టే ఆ యకట్టు పొలాల గుండా వృధాగా పారుతుంది.

దీంతోపాటు పట్టణంలోని మురుగు నీరు పూర్తిగా చెరువులోకి మళ్ళించడంతో నీ రు కలుషితమై అందులో జీవరాసులు కూ డా మృత్యువాత పడుతున్నాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విష యాన్ని ముందే గుర్తించిన మాజీ మంత్రి నా గం జనార్దన్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

కగా పూర్తి ఆధారాలు వాదనలు విన్న కోర్టు అక్రమ కట్టడాలను కూల్చి చెరువు చుట్టూరా ఎఫ్టిఎల్ పరిధిలో బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఇరిగేషన్, మైనింగ్ మున్సిపాలి టీ, రెవెన్యూ శాఖలను ఆదేశించింది.  44 చోట్ల అక్రమ కట్టడాలు ఉన్నట్లు కోర్టు దృష్టి కి తీసుకువెళ్లి వాటన్నింటినీ కూల్చినట్లు తప్పుడు నివేదికలు కోర్టుకు సమర్పించినట్లు చర్చ జరుగుతుం ది.

బయో ఫెన్సిం గ్ ఏర్పాటు చేయడంలోనూ ఉన్నతాధికారులు వె నకడుగు వేయడం పట్ల రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఓ మంత్రి ప్రధాన అనుచరుడివే ఆక్రమణలు ఎక్కువగా ఉన్నట్లు అధి కారులు గుర్తించారు. శిఖం భూములను క బ్జా చేసి వెంచర్లుగా మార్చి అమాయక ప్రజలకు అంటగట్టడంతో ప్రస్తుతం ప్రజల నుం చి కూడా తీవ్ర ఒత్తిళ్ళను ఎదుర్కొంటున్న పరిస్థితి.

దీంతోపాటు అక్రమంగా నిర్మాణా లు జరిపి విలాసవంతమైన భవనాలు ని ర్మించిన బడా నేతలు సైతం అధికారులకు ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగానే  చెరువులో నీరు నిల్వ ఉండకుండా తెరవెనుక ప్రయత్నా లు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అక్రమ కట్టడాలు ఉన్నట్లు గుర్తించిన ప్రదేశాల్లో ప్రస్తుత ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సంబంధించిన గార్డెన్ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

కేసరి సముద్రం చెరువుని అధికారులు మినీ రిజర్వాయర్ గా మార్చి నీరు నిల్వ ఉంచడంతో ఏక్ సాల్ పంట సాగు చేసుకునే మరి కొంతమంది రై తులు కూడా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. ఆ రైతుల ముసుగులో రియల్టర్లు ఉద్య మాన్ని నడిపించారు. రాష్ట్ర ప్రభుత్వం చెరువులు కుంటలు నాళాలను రక్షించాలన్న ల క్ష్యంతో హైడ్రా పేరుతో హైదరాబాద్ పరిసరాల్లోని చెరువులు కుంటలను కాపాడుతూ విజయం సాధించింది.

అదే మాదిరి నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని చెరువులు కుంట లు కాపాడేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. అత్యధిక నీటి సామర్థ్యం కలిగిన కేసరి సముద్రం చెరువు ప్రస్తుతం చిన్నపాటి కుంటగా మారే ప్రమా దం పొంచి ఉందని వెనువెంటనే ఫుల్ ట్యాం క్ లెవెల్ బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.