5 May, 2026 | 9:36 PM

తెలంగాణ తల్లి ఎక్కడా?

10-12-2024 02:06 AM

* కరీంనగర్‌లో మూడేళ్లయినా విగ్రహం ఆచూకీ కరువు

కరీంనగర్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువైన కరీంనగర్ నడిబొడ్డులో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం మూడు సంవత్సరాలుగా కనిపించకుండా పోయింది. ఉద్య మ సమయంలోనే కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని 2011లో ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం పక్కనే చొక్కారావు విగ్రహం కూ డా ఉండేది. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా 2021లో ఆ రెండు విగ్రహాలను తొలగించి గదుల్లో భద్రపరిచి జంక్షన్ పనులను చేపట్టారు.

2023లో కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టుబట్టి చొక్కారావు విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రం నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేయలేదు. 

అయితే ఈ విగ్రహం ఎక్కడ ఉన్నదో ఎవరికీ తెలియడం లేదు. దీనిపై మాజీ మేయర్ రవీందర్‌సింగ్ పలుమార్లు సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినా ఎవ రు పట్టించుకోలేదు. ఈ విగ్రహాన్ని అప్పటి ఏపీ కాంట్రాక్టర్ కనబడకుం డా చేశాడన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే నూత న విగ్రహాన్నైనా ఏర్పాటు చేయాలని నాటి ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు డిమాం డ్ చేస్తున్నారు