హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (విజయక్రాంతి) : ఈ నెల 13న లోక్సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటో న్మెంట్ ఉప ఎన్నికల పోలింగ్ జరగబోతున్న సందర్భంగా నగరంలో రేపు సాయంత్రం నుంచి రెండు రోజుల పాటు వైన్షాపులను బంద్ చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారు లు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కే. శ్రీనివాస్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్రాజ్ ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఈనెల 13న సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని వైన్ షాపు యజమానులను ఆదేశించారు. జూన్ 4న జరుగనున్న ఓట్ల లెక్కింపు రోజున కూడా వైన్ షాప్లను మూసివేయనున్నట్లు స్పష్టం చేశారు.