12 May, 2026 | 3:40 AM

వడ్ల మిషన్‌లో చిక్కుకుని మహిళ మృతి

12-05-2026 01:35 AM

చేర్యాల, మే 11: వడ్ల మిషన్‌లో చిక్కుకుని మహిళ మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని కాశ గుడిసెల గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. కాశ గుడిసెల గ్రామానికి చెందిన ఇమాంబి(50) వడ్లు పట్టే మిషన్‌లో వడ్లు పోస్తుండగా తల వెంట్రుకలు మిషన్‌కు చుట్టుకోవడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త షేక్ సుభాన్, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఒక్కగానొక్క కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. చేర్యాల ఎస్‌ఐ అపూర్వరెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు.