calender_icon.png 26 November, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

26-11-2025 12:00:00 AM

ఆర్డీవో శ్రీనివాస్ రావు

జైపూర్ (చెన్నూర్), నవంబర్ 25 : ప్రభుత్వం మహిళల సంక్షేమం దృష్ట్యా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వడ్డీలేని రుణాల పథకం మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావు అన్నారు. మంగళ వారం చెన్నూర్ నియోజక వర్గంలోని జైపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ప్రభుత్వం మహిళల సంక్షేమానికి, అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ వ్యాపార రంగాలలో రాణించే విధంగా ప్రోత్సహిస్తుందన్నారు. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించామన్నారు. అనంతరం ఆయా మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలతో కలిసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జైపూర్ తహశీల్దార్ వనజా రెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, మహిళ సంఘం ప్రతినిధి మాలతి, మహిళా సమాఖ్య సభ్యులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.