25-10-2025 11:49:22 PM
ముషీరాబాద్ (విజయక్రాంతి): చిక్కడపల్లి వివేక్ నగర్ లోని పీపుల్స్ పార్క్ లో గల నాగ దేవత, రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని శనివారం బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ సందర్శించి నాగుల చవితి పర్వదినం సందర్భంగా అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత పి.నర్సింగ్ రావు, ఆలయ పూజారి శ్రీనివాస్, జ్యోతి, చంద్రశేఖర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.