15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను నిలిపివేయాలి..

09-11-2025 11:05 PM

తెలంగాణ పబ్లికన్ పార్టీ అధ్యక్షుడు నక్క యాదీశ్వర్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): పెద్ద పార్టీలకు ఒక న్యాయం, చిన్న పార్టీలకు ఒక న్యాయంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుందని తెలంగాణ పబ్లికన్ పార్టీ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభ్యర్థి నక్క యాదీశ్వర్ ఆరోపించారు. రిపబ్లికన్ పార్టీకి కేటాయించిన మైక్ గుర్తును స్పాండ్ తో ఈవీఎం బ్యారెట్ బాక్సులో స్పష్టంగా కనబడేలా ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కేంద్ర ఎన్నికల సంఘం తమ పార్టీకి స్టాండ్ తో ఉన్న మైక్ గుర్తును కేటాయించిందిని అన్నారు. అయితే రాష్ట్ర అధికారులు మాత్రం అస్పష్టంగా తమ గుర్తు కనిపించేలా చేశారని, దీనిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. ఈ విషయంపై సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు గుర్తులు మాత్రం స్పష్టంగా ముద్రించారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు ఈవీఎం బ్యాలెట్ పై మైక్ గుర్తును స్టాండ్ తో సహా స్పష్టంగా ముద్రించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే తమ పార్టీ నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెన్నోజు శ్రీనివాస్, యోగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.