06-06-2025 05:13:31 PM
కామారెడ్డి జిల్లా అదనపు రెవిన్యూ కలెక్టర్ విక్టర్
కామారెడ్డి,(విజయక్రాంతి): నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ విక్టర్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో యోగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు యోగ అవగాహన, సాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్ , టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి , టీజీఓఎస్ జిల్లా కార్యదర్శి సాయిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... "నిత్యజీవితంలో యోగాన్ని భాగంగా చేసుకోవాలని అన్నారు. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత కోసం యోగ సాధన తప్పనిసరి చేయాలన్నారు. ప్రస్తుతం కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాల ని పేర్కొన్నారు, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి" అని సూచించారు. ఈ కార్యక్రమంలో మరో ముఖ్యాంశంగా, "ఆయుర్ చైతన్యం ఆయుర్వేద, పంచకర్మ వైద్యశాల" ప్రోప్రైటర్ డాక్టర్ చైతన్య సురేష్ సహకారంతో యోగ శిక్షకులు, యోగ సాధకులకు ప్రత్యేకంగా రూపొందించిన స్పాన్సర్డ్ T-షర్ట్స్ ఆవిష్కరిం చి అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీఓఎస్ సహాధ్యక్షులు ఎం.చక్రధర్, ఉపాధ్యక్షులు లక్ష్మణ్, జాయింట్ సెక్రటరీ గణేష్, టీజీఓఎస్ సంయుక్త కార్యదర్శి నరసింహులు, జిల్లా ఆయుష్ ప్రోగ్రాం మేనేజర్ ఆకుల శ్రీకాంత్, ఆయుష్ వైద్యాధికారులు డా. వెంకటేశ్వర్లు, డా. దేవయ్య, డా. విజయ, డా. చైతన్య, డా. నసీం సుల్తానా,ఆయుష్ పారామెడికల్ సిబ్బంది శ్రీనివాస్, మహమ్మద్ బైగు, కిషోర్,యోగ శిక్షకులు, ఇతర శాఖల అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.